అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, ఇది మరింత బలపడి 17, 18 తేదీలలో తుపాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు వెల్లడిరచారు. తుపాన్గా మారితే, దీనికి జవాద్ అని పేరును నామకరణం చేశారు. దీని ప్రభావం మంగళవారం నుండి రాష్ట్రంపై పడే అవకాశం ఉందని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్ఫాలు కురిసే అవకాశం ఉందని, 16వ తేదీ విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 18వ తేది తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.