బద్వేల్ ఉపఎన్నిక విషయంలో ఇప్పటికే వెంకట సుబ్బయ్య భార్య సుధ అభ్యర్థిగా ఉంటారని సీఎం చెప్పారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బద్వేలు ఉపఎన్నికను సీరియస్గా తీసుకుంటామని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టికెట్ ఇవ్వడం మా సంప్రదాయం. సానుభూతిగా మిగిలిన వారు పోటీ ఉండకపోవడం సాంప్రదాయం అని అన్నారు. ఒకవేళ పోటీ పెట్టినా ఎంత సీరియస్గా తీసుకోవాలో అలానే తీసుకుంటాం అన్నారు.