అదీ జగనే.. ఇదీ జగనే అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒక వీడియోను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తానంటూ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అన్న వీడియోను… ఈరోజు విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ సభలో జగన్ చేసిన ప్రసంగాన్ని పోల్చుతూ ఒక వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.