రాష్ట్రానికి ఎక్కడా అప్పులు కూడా పుట్టని దుర్గతి సీఎం జగన్ కల్పించారని మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ ఏపీని అప్పులపాలు చేసి అభివృద్ధిని విస్మరించారని అన్నారు. కమీషన్లు ఇస్తేనే ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తోందని,నరేగా నిధులకోసం కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లాల్సిన దౌర్భాగ్యాన్ని ముఖ్యమంత్రి కల్పించాడని విమర్శించారు. సీఎం వైఖరి మారకపోతే రాష్ట్ర పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని అన్నారు.