Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమరావతి కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్‌

ఏపీ రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు మంగళవారం ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో నారాయణతో పాటు లింగమనేని రమేశ్‌, రామకృష్ణ హౌసింగ్‌ సొసైటీ డైరెక్టర్‌ అంజనీ కుమార్‌ సహా పలువురు వ్యక్తులను ఆళ్ల రామకృష్ణారెడ్డి నిందితులుగా పేర్కొన్నారు. వీరందరిపై ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తమను అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ నారాయణ, అంజనీకుమార్‌, లింగమనేని రమేశ్‌ లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు నారాయణ, అంజనీకుమార్‌లకు మాత్రమే మందుస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img