అధికార పార్టీ అవినీతి, అరాచకాలపై టీడీపీ పోరును దాడులతో ఆపలేరని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఏపీలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరసనకు దిగిన వారి గొంతులు నొక్కేస్తున్నారని అన్నారు. డ్రగ్స్పై విచారణకు ఆదేశించి, డీజీపీని రీకాల్ చేయాలి. దాడులపై సీబీఐ విచారణ చేయాలని డిమాండు చేశారు.