చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణపై రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికార్లతో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీఐ మాట్లాడుతూ, సీఎం జగన్ ఆదేశాల మేరకు నెలరోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామన్నారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారని అన్నారు. ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందని, ఎన్ఐఏ సహకారం తీసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు.