Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అసెంబ్లీలో స్పీకర్‌ కొత్త రూల్‌

స్పీకర్‌ పోడియం వద్ద ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు స్పీకర్‌ తమ్మినేని సీతారం సరికొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చారు. ఇకపై పోడియం వద్దకు దూసుకువస్తే ఆటో మేటిక్‌గా సస్పెండ్‌ అయ్యే రూలింగ్‌ను తీసుకువస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్‌ను దాటితే ఆటోమేటిక్‌గా సస్పెండ్‌ అయ్యేలా స్పీకర్‌ రూలింగ్‌ తీసుకొచ్చారు. అంతేకాదు.. సస్పెండ్‌ అయిన సభ్యుడిని పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం లేకుండా ఈ రూలింగ్‌కు స్పీకర్‌ తమ్మినేని ఆమోదముద్ర వేశారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img