Friday, April 26, 2024
Friday, April 26, 2024

పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం.. పిట్టల దొర ప్రసంగంలా ఉంది

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు తులసిరెడ్డి
పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం పిట్టల దొర ప్రసంగంలా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు తులసిరెడ్డి అన్నారు.పవన్‌ డొంక తిరుగుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఒక శని గ్రహం అని మండిపడ్డారు. రాష్ట్రానికి నెంబర్‌ వన్‌ ద్రోహి బీజేపీ అన్న ఆయన.. సభా ప్రాంగణానికి కాంగ్రెస్‌ నాయకులు దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకుని అదే సభా ప్రాంగణం నుంచి కాంగ్రెస్‌ హటావో అనడం, రాహుల్‌ గాంధీని విమర్శించడం అవివేకమన్నారు.స్వశక్తి రాజకీయాలు చేయ లేకపోతే పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఎద్దేవా చేశారు. భాజపా చేతిలో పవన్‌ కల్యాణ్‌? కీలుబొమ్మ అని అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ బీజేపీ అని తులసి రెడ్డి ధ్వజమెత్తారు.భాజపా ఇచ్చే రోడ్‌మ్యాప్‌తో ముందుకుపోతానని పవన్‌ కల్యాణ్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img