Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇలాంటి నిబంధన ఏ రాష్ట్రంలోనూ ఉండి ఉండదు:

ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు
బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లొద్దంటూ టెండర్లలో ప్రభుత్వం పెట్టిన నిబంధనపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం మూడేళ్ల పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిందని విమర్శించారు. బిల్లుల కోసం కోర్టులకు వెళ్లరాదంటూ టెండర్లలో నిబంధనలు పెట్టడం రాష్ట్ర దుస్థితికి, జగన్‌ అసమర్థ పాలనకు నిదర్శనమని ఫైర్‌ అయ్యారు. కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల కోసం రూ.13 కోట్ల టెండర్‌ పనులకు పెట్టిన ఆ నిర్ణయం రాష్ట్ర పరువును తీసేసిందని, అసమర్థ పాలకులకు సిగ్గుగా అనిపించి ఉండకపోయినా.. ప్రభుత్వం నిజంగా సిగ్గుపడే నిర్ణయమని పేర్కొన్నారు. ఇలాంటి నిబంధనలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఉండి ఉండవన్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదన్న నిబంధన పెట్టే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. బిల్లుల కోసం కోర్టుకు వెళ్లరాదన్న షరతులు పెట్టే స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలంటూ ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో రూ.లక్షన్నర కోట్ల బిల్లులు పెండిరగ్‌ లో ఉన్నాయని, దాని వల్ల కాంట్రాక్టర్లు, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఎంత ప్రభావం పడుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదని విమర్శలు గుప్పించారు.
్ర

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img