వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ సీఐడీ అధికారులు దాడి చేశారంటూ ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ భరత్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీచేసింది. దీనిపై తదుపరి విచారణకు నాలుగువారాల తర్వాత లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.