ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 49,568 మందికి పరీక్షలు నిర్వహించగా..1,125 కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,31,974కి చేరింది. కరోనా మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 9 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి చనిపోయినవారు మొత్తం సంఖ్య 14,019కి చేరింది. 1356 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న మొత్తం సంఖ్య 20,03,543కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,412 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,74,13,209 నమూనాలను ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షించినట్లు తెలిపింది.