ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 54,970 పరీక్షలు నిర్వహించగా..1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో వైరస్ నుంచి 1,266 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,94,855 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మృతి చెందిన వారి సంఖ్య 13,935కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం రోజున హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.