ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,179 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2040708కి చేరింది. మహమ్మారి బారినపడి కొత్తగా11 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 14089కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,651 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2012714కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13905 యాక్టివ్ కేసులున్నాయి.