Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో కొత్తగా 800 కరోనా కేసులు

రాష్ట్రంలో ఇవాళ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మూడు రోజుల వ్యవధిలో 350 కేసుల దాకా పెరిగాయి. టెస్టుల సంఖ్య పెరగడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా పెరిగిందని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,558 నమూనాలను పరీక్షించగా 800 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 9 మంది మరణించారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,54,663 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 14,228 మంది మరణించారు. రాష్ట్రంలో 8,754 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img