Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లకు ప్రమోషన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ లకు ప్రమోషన్లు కల్పించింది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేయగా.. ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అనిల్ కుమార్ సింఘాల్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేదీలకు ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వంలోనూ, మరొకరు గవర్నర్ వద్ద కీలక స్ధానాల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులే కావడం విశేషం. ఈ ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురు ఐఏఎస్ లను ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. వీరు ప్రస్తుతం ఉన్న శాఖల్లోనే కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img