Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో విజృంభిస్తున్న కరోనా..కొత్తగా 12,615 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 47,420 శాంపిల్స్‌ని పరీక్షించగా 12,615 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,40,056కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ వల్ల విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,527కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 53871 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 3,674 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,71,658కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,20,12,102 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,338 వెలుగుచూశాయి. విశాఖలో జిల్లాలో కొత్తగా 2,117 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img