ఏపీ దేవాదాయశాఖ సలహాదారుగా నియమితులైన జె.శ్రీకాంత్ నియామకంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్ను ఏపీ ప్రభుత్వం నియమించిన సమయంలోనే పలు సంఘాలు అభ్యంతరం తెలిపాయి. అయితే ఆ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ వ్యవహారంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియామకం నిబంధనలకు విరుద్ధమని వారు తమ పిటిషన్లలో హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పిటిషనర్ల వాదనలు సరైనవేనని భావించిన హైకోర్టు… శ్రీకాంత్ నియామక ఉత్తర్వులపై స్టే విధించింది.