Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏలూరు జిల్లాలో పేలుడు.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో పేలుడు ఘటన చోటుచేసుకోవడంతో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చెత్తలో పేలుడు ఘటన జరగడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలోని తాడేపల్లి శివారు హ్యాపీ వ్యాలీ స్కూల్‌ ప్రహరీ గోడ పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నూజివీడు ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఇక దుర్గాప్రసాద్‌ చికిత్స పొందుతూ మృతిచెందగా, శాంతల మణికి స్వల్ప గాయాలయ్యాయి. భయంకర శబ్దంతో ప్రేలుడు చోటు చేసుకుందని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img