ప్రజలెవరూ ఓటీఎస్ కట్టొద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి పట్టాలను రిజిస్టేషన్ చేసి ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. కుప్పం మండలం చందం గ్రామంలో నిర్వహించిన ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లదని, ఆ పేపర్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని చెప్పారు. . రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని, వరి రైతులకు కనీస అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల్లో వేయి ఇచ్చి ఇప్పుడు లక్ష వసూలు చేస్తున్నారని, ప్రజలను అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.