తెలుగు రాష్ట్రాల జల యుద్ధం కొనసాగుతోంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి వరుస లేఖలు రాస్తూ వాటర్ వార్ను కొనసాగిస్తున్నాయి. తాజాగా కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని..ఇలాంటి సమయంలో 50-50 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలన్న తెలంగాణ డిమాండ్ సహేతుకం కాదని పేర్కొంది. వాస్తవానికి 70-30 నిష్పత్తిలోనే కేటాయింపులు జరపాల్సి ఉందని, ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికనే చేపట్టాలని సూచించింది.