Friday, April 26, 2024
Friday, April 26, 2024

గుంటూరు జిల్లాలో వివాహితపై హత్యాచారం

గుంటూరుజిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల అందించిన సమాచారం మేరకు..తుమ్మపూడి కి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టె పైపులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తుంటుంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు.ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి ఉండడాన్ని గుర్తించారు. తిరుపతమ్మ మృతదేహంపై గోళ్ళ తో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు. దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. కాగా యువతి మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు. ఈ ఘటన పట్ల కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img