Friday, April 26, 2024
Friday, April 26, 2024

చంద్రబాబు రెండోరోజు పర్యటన.. కుప్పంలో ఉద్రిక్తత..

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. కుప్పం బంద్‌ కు వైసీపీ పిలుపునివ్వడంతో… వ్యాపారులు వారి దుకాణాలను మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.అయితే చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్‌ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అలాగే టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు అన్న క్యాంటీన్‌ దగ్గర బైఠాయించారు. వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు తెలుపుతున్నారు.పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img