Friday, April 26, 2024
Friday, April 26, 2024

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం

జగనన్నే మా భవిష్యత్్ణ అనే కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. విజయవాడలో జగనన్నే మా భవిష్యత్ పోస్టర్ ను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూౌ అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా జగన్ పాలన కొనసాగుతోందన్నారు. ఈనెల 7వతేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7లక్షల మంది ఇందులో పాల్గొంటారన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అన్నది ప్రజల నుంచి వచ్చిన నినాదమన్నారు. ప్రజలకు జవాబుదారీగా రాజకీయ పార్టీలుండాలన్నారు. ప్రజల్లోనూ జగన్ పై అపారమైన నమ్మకం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img