Friday, April 26, 2024
Friday, April 26, 2024

జగనన్న కాలనీ ఇండ్లకు రూ 5 లక్షలు వెంటనే మంజూరు చేయాలి

ఆత్మకూరు డిప్యూటీ తాసిల్దార్‌ కు వినతి పత్రం అందజేసిన సి పి ఐ నాయకులు
విశాలాంధ్ర` అనంతపురం వైద్యం : భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు సిపిఐ ఆత్మకూరు మండలం డిప్యూటీ తాసిల్దారు వరప్రసాద్‌కి వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి కేశవరెడ్డి, సిపిఐ ఆత్మకూరు మండల కార్యదర్శి సనప నీళ్లు పాల రామకృష్ణ మాట్లాడుతూ.. జగనన్న ఇల్లు పథకం పేరుతో ఒకటిన్నర సెంటు స్థలం మాత్రమే ఇచ్చిపక్కా ఇల్లు నిర్మించి పేదలకు అందజేస్తామని ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలను మంజూరు చేయడం జరిగింది అన్నారు. ఇంటి నిర్మాణానికి 1,80,000 రూ.మాత్రమే ప్రభుత్వం మంజూరు చేస్తున్నది ఈ డబ్బు ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోదు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు నివాస ప్రాంతాల నుండి ఎంతో దూర ప్రాంతంలో ఇంటి స్థలం కేటాయించినప్పటికీ, ఇంటికి బడుగు కట్టలేని మేము సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశతో ఉన్నామన్నారు. ప్రభుత్వం పక్కా ఇంటి నిర్మాణానికి ఇస్తున్న ఒక లక్ష 80 వేల రూపాయలు ఏమాత్రం సరిపోదు కనీసం ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఉచితంగా మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జగనన్న కాలనీలలో తాగునీరు మురుగు నీటిపారుదల విద్యుత్తు సౌకర్యం రోడ్లు చెత్త తరలింపు తదితర మౌలిక వసతులు కల్పించాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీప్రభుత్వాన్ని దశలవారీగా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో, డీ హెచ్‌ పి ఎస్‌, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారు శివ, ముత్యాలన్న ,గోపాల్‌ నాయక్‌ ,లక్ష్మీదేవి , పాల్గొనడం జరిగిందిలి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img