Friday, April 26, 2024
Friday, April 26, 2024

జగన్‌కు పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరింది : అచ్చెన్నాయుడు

సీఎం జగన్‌ దుర్మార్గుడు, ఫ్యాక్షనిస్ట్‌ అని, రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నా.. టీడీపీ తిప్పికొడుతోందని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలను టీడీపీ గెలవబోతోందని అన్నారు. అందుకే సీఎం జగన్‌కు పిచ్చి ఎక్కిందని అన్నారు. చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుంటే పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడంలేదని, చంద్రబాబుని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటిన్‌ పెడుతుంటే దాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేశారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే జగన్‌ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. జగన్‌కు పిచ్చి ముదిరి, పరాకాష్ఠకు చేరిందన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో లా అండ్‌ ఆర్డర్‌ లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నారని, పర్యటనను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేస్తే ఒక రేటు.. దాడి చేస్తే ఒక రేటు ఇచ్చి వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారన్నారు. జడ్‌ ఫ్లస్‌ భద్రతలో ఉండే చంద్రబాబును ఈ విధంగా చేయడమేంటని ప్రశ్నించారు. కుప్పంలో అల్లర్లు అదుపుచేయకపోతే సీఎం ఇల్లు, డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img