మూడు రాజధానుల బిల్లుని కోర్టులో వెనక్కుతీసుకోవడమే..సీఎం, వైసీపీ ప్రభుత్వ పరాజయానికి సంకేతమని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందంటున్న సీఎం జగన్ మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. సీఎం జగన్రెడ్డి అమరావతి నుంచి ఇటుకను కూడా..తీసుకెళ్లలేరన్న సందేశాన్ని అమరావతి మహోద్యమసభ చాటిందని అశోక్బాబు తెలిపారు.