పింగళి వెంకయ్య రూపొందించిన జెండా కోట్లాదిమంది భారతీయుల గుండె సీఎం అని జగన్ పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం.. జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ..జాతీయ జెండా మనందరి స్వాతంత్య్రానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని కొనియాడారు. అహింస, సత్యమే సాధనంగా సాగిన మన పోరాటం ప్రపంచ మానవాళికే మహోన్నత చరిత్రగా నిలిచిందన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని, ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోందని కొనియాడారు సీఎం జగన్. రైతన్నలకు సెల్యూట్. ఆహారం, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్ లిస్ట్లో కొనసాగుతోందని గుర్తుచేశారు.