Friday, April 26, 2024
Friday, April 26, 2024

తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలి

ప్రధాని మోదీ, అమిత్‌షాకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం జగన్‌ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎంటీసీ బృందాలను రాష్ట్రానికి పంపాలని కోరారు. భారీవర్షాల వల్ల 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం లేఖలో పేర్కొన్నారు.‘ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. తిరుపతి, తిరుమల,మదనపల్లె, నెల్లూరు, రాజంపేట తదితర ప్రాంతాలు నీటమునిగాయి. గ్రామాఈణ ప్రాంతాల్లోనూ తీవ్ర నష్ట వాటిల్లింది. 196 మండలాలు నీటమునిగాయి. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులు గండ్లు పడడం వల్ల చాలా ప్రాంతాలు నీటమునిగాయని’’ సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు.తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని లేఖల్లో జగన్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img