దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి కొట్టు సత్యనారాయణ సమావేశమయ్యారు. ఆలయానికి వచ్చే అన్ని మార్గాల్లో ఏర్పాట్లను మంత్రి , సీపీ కాంతి రాణా , కలెక్టరు ఢల్లీి రావు పరిశీలించారు. అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… స్లాట్ ప్రకారం ఆన్లైన్లో వీఐపీల కోసం దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ప్రకారం 10 లెటర్స్, బ్రేక్ దర్శనానికి ఐదుగురికి అనుమతిస్తామని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం వీఐపీలకు దర్శనం ఉంటుందన్నారు. బ్రేక్ దర్శనాల కోసం ప్రత్యేక పోర్టల్ ఎర్పాటు చేస్తామని తెలిపారు. లోకల్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పరిధి పెంచుతామన్నారు. ఇంద్రకీలాద్రిపై మ్యాన్ పవర్ లేకపోయినా టీటీడీకి మించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. భవానీ భక్తుల కోసం టీటీడీ స్థలంలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. వృద్ధుల కోసం వికలాంగుల కోసం కొండపైకి బ్యాటరీ వెహికల్స్పై దర్శనానికి అనుమతిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సీపీ కాంతి రాణా టాటా మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహణ ఉంటుందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.