గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీలకమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. ఓటర్ లిస్టులు తారుమారు చేస్తున్నారని.. వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో అందరం కృషి చేయాలని టీడీపీ శ్రేణులకు తెలిపారు. జాతీయ పార్టీ కార్యాలయం మాదిరిగా జిల్లా కార్యాలయాలు తీర్చిదిద్దాలన్నారు. ప్రతి జిల్లా పార్టీ కార్యాలయానికి ఒక కంప్యూటర్ సిస్టం ఇస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.