రాష్ట్రంలో కల్తీ సారా, జే బ్రాండ్స్ మద్యం నిషేధించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్తీ సారా, జె బ్రాండ్స్ మద్యానికి వ్యతిరేకంగా శనివారం, ఆదివారం టీడీపీ ఆందోళనలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి ఆందోళనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే ఎందుకు ఉన్నాయి? అని ప్రశ్నించారు. కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని, కొత్త మద్యం బ్రాండ్లపై జగన్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ల రూరంలో జగన్రెడ్డికి 25-30 వేల కోట్లు కాజేస్తున్నారని దుయ్యబట్టారు.