Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా?

లోకేష్‌
తిరుపతి కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఎన్నికల వ్యవహారం మళ్లీ హీట్‌ పెంచింది. తిరుపతి కోఆపరేటివ్‌ టౌన్‌ ఎన్నికలకు బుధవారం పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటికే ఓట్లు వేసేందుకు దొంగ ఓటర్లు వస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ప్రశ్నించిన నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అభ్యర్థులను కూడా పోలీసులు పోలింగ్‌ బూత్‌ నుంచి తరిమేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు పడుతున్నాయని.. ప్రశ్నించిన వారినందరిని అరెస్ట్‌ చేస్తున్నారని చెబుతున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తిరుపతి ఎన్నికల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పందించారు. ‘రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంది. తిరుపతి టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో జగన్‌ రెడ్డి దొంగ బ్రతుకు మరోసారి బయటపడిరది. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను గృహ నిర్భంధం చేసే హక్కు ఎవరిచ్చారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంది. తిరుపతి టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో జగన్‌ రెడ్డి దొంగ బ్రతుకు మరోసారి బయటపడిరది. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? ఎన్నికల సమయంలో టిడిపి నాయకులను గృహ నిర్భంధం చేసే హక్కు ఎవరిచ్చారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగే అంటారు తప్ప నాయకుడు అనరు. టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో దగ్గర ఉండి దొంగ ఓట్లు వేయిస్తున్న వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలి. అరెస్ట్‌ చేసిన టిడిపి నాయకుల్ని వెంటనే విడుదల చెయ్యాలి’అని డిమాండ్‌ చేశారు.
ఎన్నికలు ఏవైనా సరే వైసీపీ మాత్రం అదే అరాచకం, అక్రమాలకి పాల్పడుతూ ప్రజాస్వామ్యన్ని కూనీ చేస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్‌ బ్యాంకు ఎన్నికల్లో వైసీపీ గెలిచే దమ్ములేక అడ్డదారులు తొక్కుతోందని.. టీడీపీ నేతలను గృహ నిర్భంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని.. ఏ కారణంతో టీడీపీ నేతలను హౌస్‌ అరెస్టులు చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నేతలను ఎందుకు హౌస్‌ అరెస్టులు చేయలేదన్నారు. పోలీసుల తీరును ఖండిస్తున్నామని.. ఎన్నికల నియమాలను ఉల్లంఘించి, నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారం బలంతో, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఈ ఎన్నికల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్‌సీపీకి ఓటమి తప్పదన్నారు.
టీడీపీ విమర్శలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కౌంటర్‌ ఇచ్చారు. దొంగ ఓట్లు వేసే వ్యక్తుల్ని వారే తీసుకు వచ్చి.. ఇక్కడ ఏదో జరుగుతోంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రాలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తుంటే.. కావాలనే డ్రామాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img