తనను ఇంకా సస్పెన్షన్లో కొనసాగించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఆయన లేఖ రాశారు. 2022 ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసిందని, రెండేళ్లు నిండిన కారణంగా రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్గా తొలగిపోయినట్లేనని లేఖలో పేర్కొన్నారు.సస్పెన్షన్ ఆరేసి నెలల చొప్పున పొడిగింపు జనవరి 27తో ముగిసిందని.. రెండేళ్లకు మించి సస్పెన్షన్కు కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు. గడువులోపు కేంద్రహోంశాఖ నుంచి అనుమతి తీసుకోనందున అది ముగిసినట్లేనని చెప్పారు. సస్పెన్షన్ తొలగినందున సర్వీస్ రూల్స్ ప్రకారం తనకు పూర్తి జీతం ఇవ్వాలని కోరారు. గడువులోగా రాష్ట్రప్రభుత్వం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోలేదు కాబట్టి.సస్పెన్షన్ ముగిసినట్లేనన్నారు. సస్పెన్షన్ తొలగినందున సర్వీస్ రూల్స్ ప్రకారం తనకు పూర్తి జీతం ఇవ్వాలని కోరారు.