Friday, April 26, 2024
Friday, April 26, 2024

పక్కా ప్రణాళికతో దాడి : చంద్రబాబు

ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింబం అని అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. ఇది 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమని అన్నారు. పట్టాభి ఇంటి పైనా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారని అన్నారు. దాడుల విషయంపై డీజీపీకి ఫోన్‌ చేస్తే స్పందించలేదన్నారు. పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలన్న కుట్రతోనే దాడి చేశారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img