Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పక్కా ప్లాన్‌తోనే వైసీపీ నేతలపై దాడి

హోంమంత్రి మేకతోటి సుచరిత
రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు భయానక వాతావరణ సృష్టించారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పెదనండిపాడు మండలం కొప్పర్రులో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైసీపీ నేతలను ఆమె పరామర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పక్కా ప్లాన్‌తోనే టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడి చేశారని అన్నారు. ముందుగానే ఇంటిపై రాళ్లు సిద్ధం చేసుకుని..బత్తుల శారద ఇంట్లోకి వెళ్లి టీడీపీ నేతలే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ నేత శ్రీకాంత్‌పై కూడా టీడీపీ నేతలు దాడి చేశారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img