Friday, April 26, 2024
Friday, April 26, 2024

పరిషత్‌ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిరది : సజ్జల

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఇన్ని రోజులు పరిషత్‌ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిరదని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని మండిపడ్డారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంతో మరికొంత సమయం వాయిదా పడిరదన్నారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండగా అ?ప్పటికే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా చేశారన్నారు. ఎన్నికల ప్రక్రియను హత్య చేసిన దోషి చంద్రబాబు అని సజ్జల మండిపడ్డారు. ఏడాది తర్వాత ఈ రోజుకు గ్రహణం వీడిరదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img