జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈరోజు పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన దీపారాధనతో స్వర్గంలో ఉన్న తన తండ్రినే పవన్ అవమాన పరిచారని… ఇలాంటి పుత్రుడు సమాజానికి అవసరమా? అని ప్రశ్నించారు. నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ… ‘ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు’ అని ఎద్దేవా చేశారు.