కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమర్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్ మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.