Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌..

జీ 20 సదస్సు సన్నాహాకాలపై చర్చ..
వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం నిర్వహించారు. జీ 20 సదస్సు సన్నాహాకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌కు సీఎం వైయస్‌.జగన్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కేవి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు) స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాల రాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img