Friday, April 26, 2024
Friday, April 26, 2024

మంత్రి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి

గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించారు. సీఎం జగన్‌ను చూసి గౌతమ్‌రెడ్డి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. ఆయన గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఓదార్చారు. సీఎం జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి.. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని, వలభనేని వంశీ, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. సోమవారం రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలోఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img