Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మంత్రి పేర్ని నాని నుంచి ఆహ్వానం అందింది

సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌
ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్లలో టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు మంత్రి పేర్ని నాని నుంచి తనకు ఆహ్వానం అందిందని సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పేర్కొన్నారు. 10వ తేదీన మరావతిలోని సచివాలయంలో కలుస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘10వ తేదీ మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయానికి మంత్రిగారు ఆహ్వానించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పేర్ని నాని గారు ధన్యవాదాలు’ అని వర్మ ట్వీట్‌ చేశారు. గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల ధరలపై ట్విటర్‌ వేదికగా ఇరువురి మధ్య మాటల యుద్దం జరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img