ప్రతి జిల్లాలో టీడీపీ ప్రధాన నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్లు దగ్గరుండి తన ఇంటి కాంపౌండ్ వాల్ కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా గోడ కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు.సజ్జల మంత్రులను కూడా ప్రక్కన పెట్టేశాడని ఆరోపించారు. ‘సజ్జలకున్న నాలెడ్జ్ ఏంటి, సజ్జలకు ఏమి తెలుసు?, సజ్జల కూడా ఒక సలహదారుడా?. క్యాబినెట్ వ్యవహారాలు కూడా సజ్జల చెప్పటం ఏంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందన్నారు. మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. యాచకుల దగ్గర కూడా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. మద్యం షాపుల్లో జరిగే దోపిడీ జగన్ ప్యాలెస్కి వెళ్తుందని అన్నారు.