Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

మూడేళ్ల తర్వాత సొంత ఊరికి చంద్రబాబు….

ఈ సంక్రాంతికి నారా, నందమూరి కుటుంబాలు కలిసి సందడి చేయనున్నాయి. చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి వెళ్లాలని ఈ రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. మూడేళ్లుగా కరోనా కారణంగా చంద్రబాబు తన సొంత గ్రామానికి వెళ్లలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో.. సంక్రాంతి సంబరాలు నారావారిపల్లెలో నిర్వహించుకోవాలని చంద్రబాబు ఫ్యామిలీ డిసైడ్‌ అయ్యింది. నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా నారావారిపల్లెలోనే సంక్రాంతి సంబరాలను జరుపుకోనుంది. మూడేళ్ల తర్వాత చంద్రబాబు ఫ్యామిలీ వస్తుండటంతో.. నారావారిపల్లెలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాలయ్య బాబు తన భార్య వసుంధరతో పాటు నారావారిపల్లె వెళ్లనున్నారు. నారా లోకేష్‌, బ్రాహ్మణి దంపతులు, వారి కుమారుడు దేవాన్ష్‌ ఈ సంక్రాంతి సంబరాల్లొ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవనున్నారు. ఈనెల 12న భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌ నారావారిపల్లెకు చేరుకుంటారు. 13న చంద్రబాబు, లోకేశ్‌, బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్తారు. ఈ విషయం తెలిసి అటు బాలయ్య ఫ్యాన్స్‌.. ఇటు బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, బాలయ్య బాబు తమ మనవడు దేవాన్ష్‌తో కలిసి సందడి చేయనున్నారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img