ఏపీ బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీ న్యాయవాదులు
విశాలాంధ్ర – శ్రీకాకుళం: ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల్లో ఒకటైన భారతదేశ రాజ్యాంగం అత్యున్నత శాసనం అని ఈ విలువలను రక్షించాల్సిన బాధ్యత ప్రతీ దేశ పౌరుని పై ఉందని ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ న్యాయ వాదుల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆగూరు ఉమామహేశ్వరరావు, చౌదరి లక్ష్మణరావు అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవం లో బాగంగా శనివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ అర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరికీ అందాలి అని, ఆ విలువలు కాపాడాల్సిన బాధ్యత అందరిమీదా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎన్ని సూర్యారావు, గౌరవ సలహా దారు పాలిశట్టి మల్లిబాబు, ఎరుకొల మురళీ మోహన్ రావు, బోయడి మురళీ కృష్ణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాన కృష్ణ చంద్, సంయుక్త కార్యదర్శి కూన అన్నం నాయుడు, సీనియర్ సభ్యులు మామిడి క్రాంతి, మొ దలవల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.