ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ అశోక్బాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు దిగిందని, ఇదే విషయాన్ని అన్ని సంఘాలు చెబుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల నుంచి ఈసారి సీఎం జగన్కు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని తెలిపారు. మెర్జింగ్తో వందల స్కూళ్లు మూలన పడుతున్నాయని, పీఆర్సీపై ఉద్యమం చేసినందుకు టీచర్లను వేధిస్తున్నారని అశోక్బాబు మండిపడ్డారు.