రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.నెల్లూరులో భగత్సింగ్ నగర్లో శుక్రవారం టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని, 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామని తెలిపారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు.పేదలపై భారం పడకూడదనే రూ.7వేల కోట్లను ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు.