సీఎం జగన్
జగనన్న సంపూర్ణ గృహ హక్కు లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు లబ్ధిదారులుకు క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్ దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్ ఇవ్వాలని ఆదేశించారు. డిసెంబర్ 21న ప్రారంభించనున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.పథకం అమలుపై దిగువస్థాయి అధికారులు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. నిర్ధేశించుకున్న సమయంలో క్షేత్రస్థాయిలో ఎంక్వెరీలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఇప్పటివరకూ 52 లక్షలమంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని తెలిపారు. 5.63 లక్షల లబ్ధిదారుదాల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేసిన అధికారులు తెలిపారు. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నామని, ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి వారికి అప్రూవల్స్ ఇస్తున్నామని తెలిపారు. మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అప్రూవల్స్ ఇస్తామని వివరించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్ ఇవ్వాలని జగన్ సూచించారు. రిజిస్ట్రేషన్ల కోసం తగినన్ని స్టాంపు పేపర్లను తెప్పించుకున్నామని అధికారులు తెలిపారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ నవంబర్ 20 నుంచి ప్రారంభం. డిసెంబర్ 15 వరకు చేపట్టాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.