తాను రియల్ హీరో కాదని, రియల్ హీరోలు ప్రజలే అని బాలీవుడ్ హీరో సోనూసూద్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మీడియాతో మాట్లాడుతూ, విజయవాడకు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన ప్రజా సేవను కొనసాగిస్తూనే ఉంటానని, ప్రజల అభిమానం ఎప్పటికీ మరువనని అన్నారు.