Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రేపటి నుంచి పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ హౌజ్‌ కమిటీ విచారణ

టీడీపీ హయాంలో పెగాసస్‌ నిఘా పరికరాలను వినియోగించారన్న ఆరోపణలపై ఏర్పాటైన ఏపీ అసెంబ్లీ హౌజ్‌ కమిటీ విచారణలో స్పీడు పెంచింది. విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకే టీడీపీ ప్రభుత్వం పెగాసస్‌ పరికరాలను వినియోగించిందన్న వార్తలపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తామేమీ ఈ పరికరాలను వాడలేదని, అసలు వాటిని కొనుగోలే చేయలేదని టీడీపీ వాదించింది. ఈ క్రమంలో ఇందులోని వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ హౌజ్‌ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మంగళవారం అమరావతిలోని అసెంబ్లీలో తొలిసారి భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించిన కమిటీ… రేపు హోం శాఖ సహా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలు శాఖల అధికారులను విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా శాఖలకు కమిటీ నుంచి లేఖలు వెళ్లాయి. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించనున్న కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img